బీసీ హాస్టల్‌లో బాలుడి అనుమానాస్పద మృతి.. వార్డెన్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్

-

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ బీసీ బాలుర వసతిగృహంలో విద్యార్థి అనుమానాస్పద మృతి ఆందోళనకు దారితీసింది. నస్రుళ్లబాద్ మండలంలోని దుర్కి గ్రామానికి చెందిన సాయిరాజ్.. ఐదో తరగతి చదువుతున్నాడు. అర్ధరాత్రి వాంతులు అవ్వటంతో ఆస్పత్రికి తరలించినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. అనంతరం మళ్లీ హాస్టల్‌లోకి పాము వచ్చిందని పేర్కొన్నారు. పామును విద్యార్థులందరూ కలిసి చంపేశారని వెల్లడించారు.

తెల్లవారుజామున 5 గంటలకు సాయిరాజ్‌ మృతిచెందాడని తెలిపారు. బంధువులు వసతి గృహానికి చేరుకొని ఆందోళన చేశారు. పాఠశాల సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని ఆరోపించారు.

ఈ విషయంపై స్పందించిన కలెక్టర్‌ వసతిగృహం వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థి మృతిపై విచారణ చేయిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version