“మీలో ఎవరు కోటీశ్వరుడు” : ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రోమో రిలీజ్

-

తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో అంటే బాగా ఇష్ట పడతారు. అయితే…. ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ షోకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా రానున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ రియాలిటీ సో కరోనా మహమ్మారి కారణంగా చాలా ఆలస్యం అయింది. ఇక ఇటీవలే ”మీలో ఎవరు కోటీశ్వరులు” షో డేట్ ఫిక్స్ ఓ ప్రోమో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

”మీలో ఎవరు కోటీశ్వరులు” షో జెమినీ టీవీలో ఆగస్టు 22 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానుంది ఈ షో. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. ఆగస్టు 22 వ తేదీన రాత్రి 8.30 గంటలకు ప్రసారం కానున్న ఈ షో లో ముఖ్య అతిధి గా రామ్ చరణ్ పాల్గొననుండగా.. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను రిలీజ్‌ చేసింది జెమినీ టీవీ యాజమాన్యం. ఇక ఈ ప్రోమో లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అదరగొట్టారు. అంతేకాదు ఎన్టీఆర్ నే ఈ ప్రోమో లో రామ్ చరణ్ ఆట పట్టించారు. ఇక ఈ ప్రోమో తో ”మీలో ఎవరు కోటీశ్వరులు” ఫాన్స్ తెగ సంతోష పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news