రాహుల్ గాంధీ వచ్చినా మునుగోడు లో కాంగ్రెస్ గెలవదు – ఇంద్రసేనారెడ్డి

-

రాహుల్ గాంధీ వచ్చిన మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదని అన్నారు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో బిజేపీ కి ఎక్కడా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ లో కానీ ఏపీ లో కానీ చంద్రబాబు తో కలిసి పనిచేసే ప్రసక్తే ఉండదన్నారు. అది గతం, టీడీపీతో పొత్తు ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. టిఆర్ఎస్ ఉప ఎన్నికలను లైట్ తీసుకుంటుందంటే మునుగోడు ఉప ఎన్నిక రాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లే ఛాన్స్ కూడా ఉందన్నారు.

రాహుల్ గాంధీ వచ్చినా మునుగోడులో కాంగ్రెస్ గెలవదన్నారు. కమ్యూనిస్టులు ఎప్పుడు మునుగోడులో ఒంటరిగా గెలవలేదన్నారు. బిజెపి ఒంటరిగా మునుగోడు లో పోటీ చేసినప్పుడు భారీగా ఓట్లు వచ్చాయన్నారు ఇంద్రసేనారెడ్డి. మాకు అక్కడ ఓట్లు ఉన్నాయన్నారు. దుబ్బాక , హుజురాబాద్ లో బలమైన అభ్యర్థుల వల్లనే బిజెపి గెలిచిందని..మునుగోడు లోనూ బలమైన అభ్యర్థికే ఓట్లు పడతాయి అన్నారు. రాజా గోపాల్ రెడ్డి నియోజక వర్గం తో ఎప్పుడూ టచ్ లోనే ఉన్నాడని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news