అమలాపాల్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మాజీ ప్రియుడు.. తెలిస్తే షాక్..!

-

తెలుగు, తమిళ భాషలలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ అమలాపాల్. దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో ప్రేమలో పడి, ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళింది.. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల చేత విడిపోవలసి వచ్చింది. అయితే ఈ విషయాన్ని మరిచి మళ్ళీ సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది అమలాపాల్. కానీ మళ్లీ తాజాగా మరొకసారి వార్తల్లో నిలుస్తూ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. తనని లైంగికంగా వేధిస్తున్నారు అని “భన్వీందర్ సింగ్ ” పై తమిళనాడులో విల్లుపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.

ఇక అంతే కాకుండా తనని బిజినెస్ లో కూడా భన్వీందర్ సింగ్ చీటింగ్ చేశారని తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తానని తాను బెదిరిస్తున్నట్లుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అమలాపాల్ కంప్లైంట్ ను పోలీసులు సీరియస్ గా తీసుకొని భన్వీందర్ సింగ్ తో పాటు మరొక 11 మంది పైన సెక్షన్ 16 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తరువాత భన్వీందర్ సింగ్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇక మిగిలిన వారికోసం పోలీసులు వెతుకుతూ ఉన్నారు. అయితే 2018లో అమలాపాల్ , భన్వీందర్ సింగ్ తో ఒక ప్రొడక్షన్ హౌస్ ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో వీరిద్దరికీ మంచి స్నేహం ఏర్పడడంతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు కూడా పుట్టించారు. కానీ కొన్ని కారణాల చేత విడిపోయారు. ఇప్పుడు భన్వీందర్ సింగ్ కేసు లో కోర్టుకు హాజరయ్యి అక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 2017లో వీరిద్దరూ పంజాబ్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారని, అందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను భన్వీందర్ సింగ్ కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే భేదాభిప్రాయాల వల్ల విడిపోయాము కానీ లీగల్ గా మేమిద్దరం భార్యాభర్తలమే అని షాక్ ఇచ్చారు. ఇక అమలాపాల్ మాత్రం తన మీద కోపంతోనే ఇలా లైంగిక వేధింపులు కేసు తన మీద పెట్టిందని భన్వీందర్ సింగ్ జడ్జికి వివరించడం జరిగిందట. దీంతో బెయిల్ కూడా మంజూరైనట్లు సమాచారం.ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version