మాజీ ఇండియా క్రికెటర్ ప్రవీణ్ కుమార్ కు రోడ్డు ప్రమాదం…

-

ఇండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ కారుకు యాక్సిడెంట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం నిన్న రాత్రి ఉత్తరప్రదేశ్ లోని పాండవ్ నగరం నుండి మీరట్ కు వెళుతున్న మార్గ మధ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ కుమార్ తన ల్యాండ్ రోవర్ కారులో తన కొడుకుతో పాటుగా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మీరట్ కు రీచ్ అయ్యాకనే అక్కడ ఉన్న కమిషనర్ బంగ్లా దగ్గర ఒక ట్రక్కు ను ప్రవీణ్ కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ ల్యాండ్ రోవర్ కారు నుజ్జు నుజ్జు అయిపోయింది. కానీ లేటెస్ట్ టెక్నాలజీ పొందుపరచబడిన కారు కావడం వలన ఎయిర్ బెలున్స్ తెరుచుకోవడం తో ప్రవీణ్ కుమార్ మరియు అతని కొడుకుకి ఎటువంటి గాయాలు తగల్లేదు.

ఈ ప్రమాదానికి కారణం అయిన ట్రక్కును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో అభిమానులు కొంతలో ఎంత ప్రమాదం తప్పిందని చాలా కంగారు పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news