సీఎం కేసీఆర్‌కు నేడు కంటి ప‌రీక్షలు.. హైద‌రాబాద్‌కు తిరుగు ప్రయాణం

-

ఢిల్లీ కి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్.. పూర్తిగా త‌న ఆరోగ్యానికి స‌మ‌యం కేటాయించారు. ఇప్ప‌టికే దంత వైద్యం చేసుకున్న సీఎం కేసీఆర్.. తాజా గా ఈ రోజు కంటి ప‌రీక్షలు చేసుకోనున్నారు. సీఎం కేసీఆర్ షెడ్యూల్ ప్రకారం.. బుధ‌వారమే.. కంటి ప‌రీక్షలు కూడా జ‌రిగిపోవాల్సింది. కానీ ప్ర‌ముఖ కంటి వైద్య నిపుణులు స‌చ్ దేవ్ బుధ వారం అందుబాటులో లేక పోవ‌డంతో నేటికి వాయిదా ప‌డింది. కాగ మంగ‌ళ వారం సీఎం కేసీఆర్ దంత వైద్యం చేసుకున్న కేసీఆర్.. బుధ వారం కేసీఆర్ స‌తీమ‌ణి శోభ కు ఎయిమ్స్ లో వైద్య ప‌రీక్షలు చేయించారు.

కాగ నేడు సీఎం కేసీఆర్.. కంటి ప‌రీక్షలు చేసుకుని.. నేడు సాయంత్రం హైద‌రాబాద్ కు తిరుగు ప్ర‌యాణం రానున్నారు. ప్ర‌త్యేక విమానంలో నేడు సాయంత్రం హైద‌రాబాద్ కు చేరుకుంటారు. కాగ సీఎం కేసీఆర్.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న థ‌ర్డ్ ఫ్రంట్ కోస‌మే అని వార్త‌లు వినిపించాయి. ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తో పాటు ఇత‌ర రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను సీఎం కేసీఆర్ స‌మావేశం అవుతార‌ని వార్తలు వచ్చాయి. కాగ సీఎం కేసీఆర్ సొంత ప‌నుల‌పైనే ఢిల్లీకి వెళ్లార‌ని స్ప‌ష్టం అయింది. అంతే కాకుండా ఈ రోజు హైద‌రాబాద్ కు రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news