నగరంలో నకిలీ ఆయుర్వేద డాక్టర్ల ముఠా దందా..!

-

ఆయుర్వేద వైద్యం తో రోగాలను నయం చేస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్న వాళ్ళను పట్టుకున్నారు. లక్షల్లో డబ్బులు దండుకుని ఉడాయిస్తున్నారు ఈ కేటుగాళ్లు. మధురానగర్ పోలీసు స్టేషన్ లో బాధితులు కంప్లైంట్ ఇస్తున్నారు. ఎస్.ఆర్.నగర్,మధరానగర్,బోరబండ పోలీసు స్టేషన్ పరిధిల్లో మోసాలు జరిగినట్టు తెలుస్తోంది.

పెరాలసిస్ తో మంచానికే పరిమితమైన మోతీనగర్ కి చెందిన షేక్ సుభాన్ బి అనే వృద్దురాలికి నయం చేస్తామంటూ ఏకంగా తొమ్మిది లక్షలు దండుకుని కేటుగాళ్లు మోసం చేసారు. బంగారు ఆభరణాలను కుదువ పెట్టి డబ్బును ఇచ్చింది. మోసం అని తెలిసి పోలీసులు దగ్గరకి వెళ్ళింది.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news