నటి ఊర్వశి మరణించారంటూ ఫేక్ న్యూస్..అసలు విషయం ఇదే !

-

అలనాటి సీనియర్‌ నటి ఊర్వశి శారద అందరికీ గుర్తే ఉంటుంది. అక్కినేని నాగేశ్వర రావు మరియు ఎన్టీఆర్‌ లాంటి హీరోల సినిమాల్లో హీరోయిన్‌ గా నటించిన మహానటి. ఆ తర్వాత చాలా సినిమాల్లో తల్లి పాత్రలు కూడా చేసింది నటి ఊర్వశి శారద. ఇక సౌత్‌ సినిమా పరిశ్రమలో పలు భాషల్లో నటించిన శారద తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే.. అలాంటి గొప్ప నటి చనిపోయారంటూ ఇవాళ ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తీవ్ర అనారోగ్యం కారణంగా శారద మృతి చెందినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ వార్తలపై తాజాగా స్వయంగా నటి శారదే స్పందించింది. ఈ మేరకు కీలక స్టేట్‌ మెంట్‌ ఇచ్చేసింది శారద. ”నేను ప్రశాంతంగా, ఆనందంగా చైన్నైలోని ఇంటిలోనే ఉన్నాను. నాపై వస్తున్న తప్పుడు వార్తలు ఎవరు నమ్మవద్దు. తాను చనిపోయానంటూ వస్తున్న వార్తలు అన్ని తప్పుడు కథనాలు. వాటిని దయ చేసి ఆపండి” అని నటి శారద ఓ ఆడియో ద్వారా స్పష్టం చేశారు. ఈ స్టేట్‌ మెంట్‌ తో ఆమె చనిపోయారంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news