బాలయ్య బాబు కొంచం గెస్ట్ లను మార్చు బాబు..!!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా అన్ స్టాపబుల్ షో  చూసి అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1 ఓటిటి లలో రికార్డ్ మోత మోగించింది.

ఇప్పుడు సీజన్ 2 చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. వచ్చిన వారితో బాలయ్య బాబు  ఇట్టే కలిసి పోతూ తెగ హడావిడి చేస్తున్నారు.ఇక సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబు, లోకేశ్ వచ్చారు. ఇక రెండో ఎపిసోడ్ లో,డి జే టిల్లు సిద్ధార్ద్, విశ్వక్ సేన్ వచ్చి సందడి చేశారు.మూడవ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్టులుగా యంగ్ హీరోలు అడివి శేష్, శర్వానంద్ వచ్చారు.ఇక వారితో బాలయ్య తన దైన స్టయిల్ మాటలతో చెలరేగి పోయారు. హీరోయిన్స్ విషయం లో వారిని చిపిపి ప్రశ్నలు అడిగారు.

ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నారని తెలుస్తోంది.కాని ఈ ఎపిసోడ్ పై జనాల్లో ఏమాత్రం ఆసక్తి లేకుండా పోయింది.ఆయన చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున వంటి వారితో షో చేయాలని అందరూ ఏంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాని ప్రస్తుతం ట్రెండింగ్ లో లేని కిరణ్ కుమార్ రెడ్డి గార్ని పిలవడం ఏంటని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలా అయితే షో కు వచ్చిన క్రేజ్ మొత్తం పోతుందని వ్యాఖ్యానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news