2017 డిసెంబర్ 1 లోపు విక్రయించిన పాత వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి…!

-

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2017 డిసెంబర్ 1 లోపు విక్రయించిన పాత వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేయడానికి ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త థర్డ్ పార్టీ మోటారు వాహన భీమాను కొనుగోలు చేయడానికి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేయాలని కూడా ఈ ముసాయిదాలో పేర్కొన్నారు. ఇది గనుక అమలు చేస్తే కొత్త నిబంధనలు వచ్చే ఏడాది నుంచి అమలులోకి రానున్నాయి.

ఈ మేరకు గురువారం ఒక ప్రకటన వచ్చింది. “డిసెంబర్ 1, 2017 లోపు అమ్మిన పాత వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేయడంపై వాటాదారుల అభిప్రాయాలు, సూచనలు కోరేందుకు గానూ… 2020 సెప్టెంబర్ 1 వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జీఎస్ఆర్ 541 (ఈ) ను విడుదల చేసింది. సవరించిన నిబంధన జనవరి 2021 నుండి అమలులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. కొత్త 4- వీలర్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం 2017 నుండి ఫాస్ట్ ట్యాగ్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news