చిన్న కొడుకులను పెద్ద కొడుకు మోసం చేసాడని తండ్రి ఆత్మహత్య

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం జరిగింది. భూపాలపల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో రైతు  ఆత్మహత్యాయత్నం చేసుకోబోయాడు. గొర్లవేడు గ్రామానికి చెందిన మామిడి వెంకులు తన 30 ఎకరాల భూమిని తన ముగ్గురు కొడుకులకు సమానంగా పంచగా మొత్తం భూమిని స్థానిక రాజకీయ నాయకులు అండతో తన పెద్ద కొడుకు పేరు మీదకు మార్చుకున్నాడని మందు డబ్బా తో నిరసన వ్యక్తం చేసాడు.

ఇదేమిటని రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదంటూ దాటేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు. వెంటనే తమకు న్యాయం చేయాలని తాసిల్దార్ కార్యాలయం ముందు మందు డబ్బా తో నిరసనకు దిగారు గొర్లవేడు కు చెందిన రైతు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారి ఫిర్యాధుని ఎమ్మార్వో స్వీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news