ఫీజు రియంబర్సమెంట్ తల్లి ఖాతాలోకే…!

-

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమ్మ ఒడి పథకం ఏ విధంగా అయితే అందిస్తున్నారో ఈ మొత్తాన్ని కూడా అదే విధంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల తల్లి అకౌంట్‌కే ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని ఏపీ సిఎం జగన్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని ఆయన వివరించారు.

ప్రతి త్రైమాసికం పూర్తయిన తరువాత నేరుగా తల్లి అకౌంట్‌లోకి జమ చేస్తామన్న జగన్… 2018-19కి సంబంధించి రూ. 1800 కోట్ల బకాయిలు చెల్లించామని వివరించారు. ఈ ఏడాది మూడు త్రైమాసికాలకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని, తల్లిదండ్రుల నుంచి అదనంగా వసూలు చేసిన డబ్బును విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే 191 కాలేజీలకు ఆదేశాలిచ్చామని అన్నారు. సక్రమంగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లకు తాజాగా జగన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ మొత్తం తిరిగి చెల్లించని కాలేజీలపై చర్యలు తీసుకుని బ్లాక్ లిస్టులో పెడతామని ఏపీ సీఎం హెచ్చరించారు. కాగా ఏపీలో అమ్మ ఒడి పథకంలో భాగంగా అక్రమాలు జరగకుండా ఉండేందుకు గాను తల్లి ఖాతాలోకే నేరుగా నగదు జమ చేస్తున్నారు.ఇప్పటి వరకు కాలేజి ఖాతాలో జమ చేస్తూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వం.ఇప్పటి వరకు కాలేజి ఖాతాలో జమ చేస్తూ ఉండేది రాష్ట్ర ప్రభుత్వం

Read more RELATED
Recommended to you

Latest news