డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన సినీ నిర్మాత సుప్రియా యార్లగడ్డ

-

టాలీవుడ్ నిర్మాత సుప్రియ యార్లగడ్డ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలిగా, నాగార్జున మేనకోడలిగా అందరికీ సుపరిచితమే. అయితే ఇవాళ టాలీవుడ్ కి చెందిన పలువురు నిర్మాతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో నిర్మాత సుప్రియ యార్లగడ్డ గడ్డ కూడా కలిశారు.

ప్రస్తుతం ఈమె కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్-సుప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ తరువాత సుప్రియ సినిమాలకు దూరమైంది. నటనకు దూరం అయినా నిర్మాతగా మారి అన్నపూర్ణ బ్యానర్ లో పలు సినిమాలకు నిర్మాణ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగిన క్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత ఎప్పుడూ వీరిద్దరూ కలిసి నటించలేదనే కంటే నటించే అవకాశం రాలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్, హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ అయిన సుప్రియా కలవడం కాస్త చర్చనీయాంశం అయిందనే చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version