బ్రేకింగ్ : ఎఎస్ రావు నగర్ ఎస్బిఐ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం

-

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్ని ప్రమాదాలు టెన్షన్ పెడుతున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక చోట ఏదో ఒక అగ్నిప్రమాదం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా తాజాగా రాచ కొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాప్రా సర్కిల్ ఎ.ఎస్ రావు నగర్ ఎస్ బి ఐ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. తాళాలు వేసి ఉండటంతో లోపల ఏమి జరిగిందో అర్ధం కావడం లేదు.

లోపల నుండి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బంది కి సమాచారం ఇచ్చినట్టు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు బ్యాంకులకు సెలవు ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టు చెబుతున్నారు. అయితే అసలు మంటలు ఎందుకు చెలరేగాయి ? బ్యాంక్ కావడంతో ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా అనే విషయాలు బ్యాంక్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నాక తెలిసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news