ముంబైలో ఫైర్ యాక్సిడెంట్.. ఒకే ఫ్యామిలీలో ఏడుగురు మృతి

-

ముంబైలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ ప్రమాదం వలన మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అగ్నికి ఆహుతి అయ్యారు. ఈ విషాదకరమైన ఘటన చెంబూరులోని సిద్ధార్థ్‌ కాలనీలో ఆదివారం తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో వెలుగుచూసింది. రెండంతస్తుల భవనంలో నేటి ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారని అధికారులు ధృవీకరించారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎలక్ట్రికల్ వస్తువులను ఉంచే దుకాణంలో షార్ట్ సర్క్యూట్ అయ్యిందని, అలా మంటలు మొదటి అంతస్తుకు వ్యాపించాయని అధికారులు గుర్తించారు.

ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీసిన పోలీసులు తొలుత రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. మంటల్లో చిక్కుకున్న ఏడుగురిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే వారు చనిపోయిటన్లు వైద్యులు నిర్దారించారు.మృతులు పారిస్ గుప్తా, నరేంద్ర గుప్తా, మంజు ప్రేమ్ గుప్తా, అనితా గుప్తా, ప్రేమ్ గుప్తా, విధి గుప్తా, గీతా గుప్తాగా గుర్తించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news