BREAKING : బీహార్ లో ఘోర అగ్నిప్రమాదం..ఆగి ఉన్న ట్రైన్ లో చెలరేగిన మంటలు

-

బీహార్ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్యాసింజర్ ట్రైన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని మధుబాని రైల్వే స్టేషన్లు చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం సరిగ్గా తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఘోర అగ్ని ప్రమాదం స్థానికంగా కలకలం రేపుతోంది.

అయితే ఈ మంటలు చెలరేగిన రైలు ప్రయాణీకులు ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంతో ఆ స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అయితే ఈ అగ్ని ప్రమాదం ఇలా సంభవించింది అనేదానిపై ఇంకా వివరాలు తెలియరాలేదు. ఈ అగ్ని ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు… దర్యాప్తు మొదలుపెట్టారు. ఇక అటు ఇతర రైళ్లు యధావిధిగా నడిచేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version