ఏపీలోని కొనసీమలో పేలిన బాణసంచా.. మంటల్లో 14 మంది!

-

పొరుగు రాష్ట్రం ఏపీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా పేలి ఓ ఇంట్లో 14 మంది తీవ్రగాయాల పాలయ్యారు. ఈ భయానక ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. అయితే, ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అయితే, బాణాసంచా పేలిన సమయంలో అక్కడ ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన ధాటికి రెండు అంతస్థుల భవనం ఒక్కసారిగా కూప్పకూలింది. అయితే, ఇంట్లోకి బాణాసంచా ఎలా వచ్చింది. గుట్టుగా ఎవరైనా తయారు చేస్తున్నారా? లేక అక్రమంగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టరా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి మరణాలు నమోదవ్వలేదని స్థానిక ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news