సింఘు బోర్డర్ వద్ద రైతుల ఆందోళనలో కాల్పుల కలకలం

-

సింఘు బోర్డర్ వద్ద రైతుల ఆందోళన లో కాల్పుల కలకలం రేగింది. సోనీపద్ దగ్గర గాలోలోకి మూడు రౌండ్ ల కాల్పులు జరిగాయని అంటున్నారు. అర్ధరాత్రి తర్వాత ఆగంతకులు కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక నెంబర్ ఉన్న కారులో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు పరారయ్యారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. మరో పక్క రాకేష్ తికాయత్ కు సైతం బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెబుతున్నారు. అయితే బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మొన్ననే ఈ రైతుల ఆందోళనలు మొదలయి 100 రోజులు దాటాయి. అయితే ఇంతలోనే ఇలా జరగడం ఆశ్చర్యకరంగా మారింది. ఇక వీరి మీద ఎవరు కాల్పులు జరిపారు ? అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.  

Read more RELATED
Recommended to you

Latest news