ప్రాణం తీసిన లాటరీ.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి.. – సుసైడ్‌ వీడియో

-

రాష్ట్రంలోని విల్లుపురం సమీపంలోని సలామత్‌నగర్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు తమ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్ లైన్ లాటరీ టికెట్లు కొని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడమే ఇందుకు కారణం. అరుల్ అనే ఆభరణాల వ్యాపారి లాటరీ టికెట్లు కొనేవాడు. డబ్బంతా వాటికే ఖర్చు చేస్తుండడంతో అతడి కుటుంబం తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

ఈ క్ర‌మంలోనే తన భార్య, ముగ్గురు పిల్లలకు సైనైడ్ ఇచ్చి, తానూ దాన్ని తాగడంతో వారందరూ మృతి చెందారు. అంతేకాదు, అతడు ఈ ఆత్మహత్య ఘటనను సెల్ ఫోన్ లో చిత్రీకరించి, కొందరికి షేర్ చేశాడు. ఆ వీడియో చూసిన వెంటనే కొంత మంది అరుల్ ఇంటికి చేరుకుని, అతడి ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలకి ప్రవేశించారు. అయితే, అప్పటికే ఐదుగురు మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news