ఐబిఎస్ కాలేజీ హాస్టల్ లో జరిగిన ర్యాగింగ్ ఘటనలో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్

-

హైదరాబాద్ ఐబీఎస్ కాలేజీ హాస్టల్ లో జరిగిన ర్యాగింగ్ ఘటనకు సంబంధించి ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరో ఐదుగురు విద్యార్థుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధిత విద్యార్థి ఫిర్యాదుతో ర్యాగింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిర్లక్ష్యం వహించిన కాలేజీ యాజమాన్యం పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అటు కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులను సస్పెండ్ చేసింది.

బాధిత విద్యార్థి ఒక వర్గానికి సంబంధించి కించపరిచే విధంగా మెసేజ్ చేయడమే ఈ గొడవకి కారణంగా మారింది. ఆ మెసేజ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ గా మారాయి. దీంతో పదిమంది సీనియర్ విద్యార్థులు అతనిపై దాడి చేశారు. అలా సీనియర్ విద్యార్థులకి, జూనియర్ విద్యార్థులకు మధ్య గొడవ ఏర్పడింది. ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మొహమ్మద్ ఇమాద్, సోహైల్, వర్షిత్, గణేష్, వాసుదేవ్ వర్మ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news