గుంటూరులో కలకలం..ఏకంగా 20 మంది..!

-

లాక్‌డౌన్‌ కారణంగా ఇన్ని రోజులు మూసుకుపోయిన దుఖానాలన్నీ లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో మెల్లిగా తెరుచుకుంటున్నాయి. కాగా, అలా తెచ్చుకున్న గుంటూరు జిల్లాలోని ఓ హోటల్‌లో ఈ రోజు ఉదయం కలకలం రేగింది. జిల్లాలోని కొల్లిపర మండలం తూములూరులోని ఓ హోటల్‌లో ఇవాళ ఉదయం చాలా మంది టిఫిన్‌ తిన్నారు. అనంతరం అందులో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్లే వారు అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వారందరినీ ఆసుపత్రులకు తరలించారు. వారంతా ఆ హోటల్‌లో టిఫిన్‌ తిన్న అనంతరం వాంతులు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అలాగే కొందరికి కళ్లు తిరిగాయని అన్నారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news