హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ హోంమంత్రి ఫైర్

-

హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ హోంమంత్రి వనిత మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో వనిత మాట్లాడుతూ.. అనిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.తమ నాయకుడు వైఎస్ జగన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.అనిత మాట్లాడుతున్న మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దాడులు జరుగుతుంటే హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని మాజీ హోంమంత్రి నిలదీశారు. అనిత కూడా ఎమ్మేల్యేగా గెలిచే మంత్రి అయ్యారని గుర్తు చేశారు.చంద్రబాబు కూడా కుప్పానికి ఎమ్మేల్యేనే అని అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని, వాళ్ల పనిని వాళ్లు చేసుకోనివ్వాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీ నేతలు దాడులు చేసి, తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై జగన్ ఢిల్లీకి వెళ్తే తానూ కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటానని మంత్రి వంగలపూడి అనిత చెప్పిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానంద హత్యతో పాటు గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో చర్చించేందుకు తానే వస్తానని ఆమె సవాలు విసిరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news