పవన్‌ది కౌలు రైతు భరోసా కాదు మీ రాజకీయ భరోసా : కన్నబాబు

-

చంద్రబాబు త్యాగం చేస్తానని చెప్పకుండా ఇతర పార్టీలను త్యాగాలకు సిద్దంగా ఉండాలని చెబుతున్నాడు.. ప్రతిపక్ష పార్టీలు రైతాంగాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయంటూ విమర్శలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కౌలు రైతులు పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రంలో 3500 మంది రైతులు చనిపోయారని చెబుతున్నారు మీకు ఈ లిస్టు ఎక్కడనుండి వచ్చింది టీడీపీ ఆఫీస్ నుండి వచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 300 మంది కౌలు రైతులు చనిపోయారని రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, 2014 ఎన్నికల్లో టీడీపీతో ఉన్న మీరు కౌలు రైతుల మరణాలపై ఎందుకు మాట్లాడలేదన్నారు.

Kurasala Kannababu: Latest News, Videos and Photos of Kurasala Kannababu |  The Hans India - Page 1

మీరు చేసేది కౌలు రైతు భరోసా కాదు మీ రాజకీయ భరోసా యాత్ర అంటూ ఎద్దేవా చేశారు కన్నబాబు. బీజేపీతో పొత్తులో ఉన్న మీరు టీడీపీతో కలిసి పోటీ చేయడానికి రోడ్ మ్యాప్ సిద్దం చేస్తున్నారని, మీ రోడ్ మ్యాప్ ను అర్ధం చేసుకోలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరని ఆయన మండిపడ్డారు. రైతులకోసం తెలుగు దేశం ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా?.. చంద్రబాబు సైకిల్ ఎప్పుడో పంక్చర్ అయిపోయిందంటూ కన్నబాబు సెటైర్లు వేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news