ఏపీలో నవంబర్ లేదా డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలు -మాజీ మంత్రి నక్కా

-

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు సంచలన కామెంట్స్ చేశారు.జగన్ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా రద్దు చేయవచ్చు..నవంబర్ లేదా డిసెంబరు లో ముందస్తు ఎన్నికలు రావచ్చని హాట్‌ కామెంట్స్‌ చేశారు. పథకాలు అమలు చేయలేని దుస్థితిలో జగన్‌ ఉన్నాడు… మరోసారి తప్పు జరగకుండా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టిడిపి క్యాడర్ ఎన్నికల లో పోరాటం కోసం సిద్దంగా ఉండాలని కోరారు.

కోడి కత్తి దాడి లో కుట్ర కోణాన్ని ఎన్ ఐ ఏ తేల్చాలని…కోడికత్తి నిందితుడ్ని నాలుగు సంవత్సరాలు గా జైల్లో మగ్గ పెడుతున్నారన్నారు. వివేకా హత్య కేసు లో సిబిఐ విచారణ తో జగన్ కుటుంబం లో ఒక్కొక్కరు జైలు బాట పడుతున్నారు…జగన్ ప్రభుత్వానికి చివరి ఘడియలు మొదలయ్యాయని తెలిపారు. జగన్ విశాఖ లో కాకపోతే నాలుగు చోట్ల కాపురా లు పెట్టుకోవచ్చు, ఎన్నికలు అయిపోయాక జగన్ ఎక్కడ కాపురం పెట్టాలో ప్రజలు నిర్ణయిస్తారన్నారు మాజీ  మంత్రి నక్కా ఆనంద్ బాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version