మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలు శిక్ష

-

పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చింది ప్రజా ప్రతినిధుల కోర్టు. పాయం వెంకటేశ్వర్లకు కోర్టు జైలు శిక్ష తో పాటు జరిమానా విధించింది. ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువుకావడంతో 6 నెలలు జైలు, రూ. 10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. పాయం వెంకటేశ్వర్లు ఎన్నికల్లో డబ్బులు పంచారన్న ఆరోపణలతో 2018లో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.

విచారణలో అభియోగాలు రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు రూ. 10 వేలు జరిమాను వెంకటేశ్వర్లు చెల్లించారు. తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు జైలు శిక్షను ప్రజా ప్రతినిధుల కోర్టు నిలిపివేసింది. అలానే ప్రభుత్వ చీఫ్‌ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న కేసును కోర్టు కొట్టివేసింది. కాగా.. ఇటీవలే.. టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత మరియు ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే… దానం నాగేందర్‌ కు కూడా జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news