కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూత

-

బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఇక లేరు. తీవ్ర గుండెపోటుకు గురై ఆమె కన్నుమూశారు. మంగళవారం రాత్రి 10.15 గంటల సమయంలో ఆమెకు తీవ్రంగా గుండెపోటు వచ్చింది. దీంతో సుష్మాను ఢిల్లీలోని ఎయిమ్స్ కు హుటాహుటిన తరలించారు. చికిత్స అందిస్తుండగానే ఆమె తుదిశ్వాస విడిచారు. సుష్మా స్వరాజ్ వయసు 67 ఏళ్లు.

సుష్మా స్వరాజ్ మరణవార్త బీజేపీ నాయకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మృతికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. ఆమెకు భర్త స్వరాజ్ కౌశల్, కుమార్తె బన్సురి ఉన్నారు. హర్యానాలోని అంబాలా.. సుష్మ స్వస్థలం. 1952, ఫిబ్రవరి 14న ఆమె జన్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news