ప్రాణం పోసే వైద్యులే ప్రాణం తీశారు.. నలుగురు పసికందుల మృతి.!

-

ప్రాణాలు పోసే వైద్యుడు ప్రత్యక్షదైవం అని చెబుతూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఏకంగా ప్రాణాలు పోసే వైద్యులే మనుషుల ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు వదలాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

షాదోల్ జిల్లా ఆస్పత్రిలో వైద్యులు ఇతర సిబ్బంది నిర్లక్ష్యం తో కేవలం ఒక్క రోజులోనే నలుగురు పసికందుల మృతి చెందారు. అయితే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ పసికందులను కోల్పోవాల్సి వచ్చింది అంటూ ప్రస్తుతం బాధిత కుటుంబీకులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దీనిపై స్పందించిన సూపరిండెంట్ పసికందుల మృతి విషయంలో ఆసుపత్రి సిబ్బంది తప్పేమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news