అమిత్ షా గారు.. ఇరానీ చాయ్ తాగి.. బిర్యానీ తిని వెళ్ళండి..!

-

మరికొన్ని గంటల్లో జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలోనే ఉన్న కొంత సమయాన్ని కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీల ముఖ్య నేతలు కూడా రంగంలోకి దిగి శరవేగంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే… గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రతిపక్షాల పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

గోషామహల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కూడా టీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రధాని 15 లక్షలు ఇస్తామని చెప్పారని ఎవరి ఖాతాలో కైనా వచ్చాయా అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. హైదరాబాద్ వాసులకు ఢిల్లీ బాయ్స్ కావాలా గల్లీ బాయ్స్ కావాలా తేల్చుకోవాలి అంటూ సూచించారు. వరదలు వచ్చినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా రాని ఢిల్లీ పెద్దలు ప్రస్తుతం ఎన్నికలు అనగానే పరుగులు పెట్టుకుని వస్తున్నారు అంటూ విమర్శించారు. హైదరాబాద్ పర్యటన కోసం వచ్చిన ఢిల్లీ పెద్దలు ఇరానీ చాయ్ తాగి బిర్యాని తిని వెళ్లాలి అంటూ సూచించారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news