ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని ప్ర‌కాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీ కొన్నాయి. దీంతో అక్క‌డికక్క‌డే న‌లుగురు మృతి చెందారు. ఈ విషాదాక‌ర ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లాలోని బేస్త‌వారి పేట మండ‌లం పెంచిక‌ల‌పాడు స‌మీపంలో జ‌రిగింది. కాగ క‌ర్నూల్ జిల్లా నుంచి మిర్చితో వ‌స్తున్న డీసీఎం.. ఆవుల‌తో వ‌స్తున్న మినీ వ్యాన్ వ‌స్తున్నాయి. ఈ రెండు వాహ‌నాలు అనంత‌ర‌పురం – అమ‌రావ‌తి జాతీయ ర‌హ‌దారిపై గ‌ల పెంచిక‌లపాడు గ్రామం స‌మీపంలోకి వ‌చ్చిన త‌ర్వాత డీసీఎం, మినీ లారీ ఎదురెదురుగా వ‌చ్చి ఢీ కొన్నాయి.

దీంతో రెండు వాహ‌నాల్లో ఉన్న న‌లుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. అలాగే మ‌రో ఇద్ద‌రికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అలాగే మినీ వ్యాన్ లో ఉన్న 8 ఆవులు, ల్యాగ‌లు కూడా అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాయి. న‌లుగురు వ్య‌క్తులు, 8 ఆవులు మృతి చెంద‌డంతో జాతీయ రాహాదారి ర‌క్తంతో త‌డిసిపోయింది. మృత దేహాలు కూడా జాతీయ ర‌హాదారిపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version