చిక్కుల్లో నయనతార…ఆ కేసులో నోటీసులు జారీ

-

స్టార్ నటి నయనతారకు తమిళనాడు హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. డాక్యుమెంటరీలో చంద్రముఖి మూవీ క్లిప్స్ ను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సినీ నిర్మాతలు కోర్టులో నయనతారపై పిటిషన్ వేశారు. అంతకుముందు “నేను రౌడీనే” క్లిప్ వాడటంపై ఆ సినిమా నిర్మాత సైతం కోర్టును ఆశ్రయించారు. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన కోర్టు సినిమా క్లిప్ వాడటంపై అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. నయనతార నెట్ ఫ్లిక్స్ కు కోర్ట్ నోటీసులు ఇచ్చింది.

Fresh Trouble For Nayanthara Netflix Documentary, Madras High Court Asks Makers To Respond
Fresh Trouble For Nayanthara Netflix Documentary, Madras High Court Asks Makers To Respond

ఈ విషయం పైన నయనతార ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా, ప్రస్తుతం నయనతార తమిళ్, మలయాళం, తెలుగులో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నయనతార నటిస్తోంది. ఇందులో చిరంజీవి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news