జీశాట్ – 11 విజయవంతం..

-

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేసిన మరో భారీ ప్రయోగం విజయవంతం అయింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్‌ గయానా కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ఏరియన్-5 రాకెట్ ద్వారా జీశాట్‌-11 ఉపగ్రహాన్ని రోదసీలోకి విజయవంతంగా పంపింది. 5,854 కిలోల బరువున్న జీశాట్-11ను ఏరియన్‌-5 రాకెట్‌ 29 నిమిషాల ప్రయాణం అనంతరం కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.  ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో పరిమాణం పరంగా జీశాట్‌-11 అత్యంత బరువైంది. డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశమంతటా సెకనుకు 100 జీబీ డేటా అందించేందుకు నాలుగు జీశాట్‌-11 ఉపగ్రహా ప్రయోగాలకు ప్రణాళిక రూపొందించగా ఇది మూడోది.  ఇది 15 ఏళ్లపాటు సేవలు అందించనుంది. దీనిలో దేశ సమాచార వ్యవస్థ కోసం 32 కేయు బాండ్‌తోపాటు 8 కేఏబాండ్‌ ట్రాన్స్‌ఫాండర్లను ఏర్పాటు చేశారు. నిమిషానికి 16 గిగాబైట్స్‌ వేగంతో ఇంటర్నెట్‌ను అందించనుంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం సమాచారం అందించనున్న జీశాట్‌-11 ఉపగ్రహం భారత్‌కు విలువైన అంతరిక్ష అసెట్ గా నిలవనుందని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు.

దేశీయ తొలి హెచ్‌వైఎస్ఐఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఆరు రోజుల అనంతరం మరో భారీ ప్రయోగం నిర్వహించడం ఇస్రో చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నామన్నారు.  జీశాట్ -11 విజయవంతం అవ్వడంతో భారత రాష్ట్ర పతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీతో సహా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news