హనుమాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై జీ5 కీలక ప్రకటన

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.ఈ సినిమాలో కథానాయికగా అమృతా అయ్యర్ నటించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.

ఈ సినిమా హనుమాన్ ఓటీటీ విడుదల పై జీ5 కీలక ప్రకటన చేసింది. ‘సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అతి త్వరలో మూవీ తెలుగు వెర్షన్ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో స్ట్రీమింగ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ను చూడండి’ అని ట్వీట్ చేసింది. కాగా ఈ మూవీ హిందీ వెర్షన్ ఎల్లుండి నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news