Gadwal Bidda: సోషల్ మీడియా సంచలనం.. “గద్వాల్ రెడ్డి” బిడ్డ మృతి..

-

ఈ మధ్య కాలంలో.. సోషల్‌ మీడియా స్టార్లు.. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారు. వైరల్‌ వీడియోలు చేస్తూ… సామాన్య ప్రజల మనసులను గెలుస్తున్నారు. క్షణాల్లోనే సోషల్‌ మీడియా స్టార్లు అయిపోతున్నారు. ఇలాంటి కోవలోనే వస్తాడు.. గద్వాల బిడ్డ గా ఫేమస్ అయిన మల్లి కార్జున.

చిన్న తనం నుంచి ఆస్తమాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మల్లి కార్జున్‌ సోషల్‌ మీడియాలో చేసే వ్యాఖ్యలు నిత్యం వైరల్‌ అవుతూనే ఉంటాయి. తనకు ఆరోగ్యం సరిగ్గా లేకున్నా తన వాయిస్‌ తో నెటిజన్లను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటాడు. ఇటీవల వర్మ పై కూడా ఓ వీడియో చేగా తెగ వైరల్‌ అయింది.

అతనిపై నెటిజన్లు లెక్కలేనన్ని మీమ్స్‌ క్రియేట్‌ చేసి వైరల్‌ చేస్తుంటారు. ఇలా తన మాటలతో ఎన్నో లక్షల మంది నెటిజన్లను అలరిస్తున్న మల్లిఖార్జున… తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతడు ఆదివారం మృతి చెందాడు. దీంతో అతని కుటుంబం విషాదంలోకి వెళ్లింది.

Read more RELATED
Recommended to you

Latest news