న‌ల్గొండ‌లో దారుణం.. భార్య మ‌ద్యానికి డ‌బ్బు ఇవ్వ‌లేద‌ని హ‌త్య

-

మ‌ద్యానికి బానిస అయిన ఒక వ్య‌క్తి క‌ట్టుకున్న భార్య‌నే హ‌త మార్చాడు. మ‌ద్యం కొనుగోలు చేసుకోవ‌డానికి డ‌బ్బు ఇవ్వ‌లేని భార్యను కిరాతంగా గొడ్డ‌లితో న‌రికి చంపాడు. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న న‌ల్గండో జిల్లాలోని బొక్క‌ముంతల్ ప‌హాడ్ లో చోటు చేసుకుంది. కాగ జిల్లాలోని బొక్క ముంత‌ల్ ప‌హాడ్ లో ధ‌ర్మారం రుద్ర‌య్య, రాజేశ్వ‌రి (35) దంప‌తులు నివాసం ఉంటుంన్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు. పెద్ద కుమారుడు 15 ఏళ్ల వ‌య‌స్సు ఉంటుంది. చిన్న కొడుకు ఇటీవ‌లే క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌ర‌ణించాడు. రోజు కూలీ చేసుకుని జీవ‌నాన్ని గ‌డ‌పే కుటుంబం.

అయితే క‌రోనా కార‌ణంగా పని లేక పోవ‌డంతో హైద‌రాబాద్ లో ప‌ని చేసుకుంటున్నారు. కాగ చిన్న కుమారుడు మృతి చెందిన నాటి నుంచి రుద్ర‌య్య మ‌ద్యానికి బానిస అయ్యాడు. మ‌ద్యానికి డ‌బ్బుల కోసం రాజేశ్వ‌రిని వేధించేవాడు. కాగ ఇటీవ‌ల వాళ్లు త‌మ సొంత గ్రామానికి వ‌చ్చారు. అక్క‌డ రాజేశ్వ‌రిని డ‌బ్బుల కోసం రుద్ర‌య్య వేధించాడు. డ‌బ్బులు ఇవ్వ‌క పోవ‌డంతో గొడ్డ‌లితో రాజేశ్వ‌రి న‌రికాడు. ఇది గ‌మనించిన బంధువులు రాజేశ్వ‌రిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాజేశ్వ‌రి మృతి చెందింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news