ప్రజలకు అన్నం పెట్టెదే రెడ్డి కులం : గంగుల షాకింగ్ కామెంట్స్

-

హుజురాబాద్ ప్రచారంలో గంగుల కమలాకర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. “నా రాజకీయ గురువు పెద్ది రెడ్డి. ప్రజలకు అన్నం పెట్టె కులం రెడ్డి కులం” అని పేర్కొన్నారు గంగుల. రెడ్డి భవనం కోసం ఎకరం భూమి కోటిరూపాయలు మంజూరు చేస్తున్నామని.. నేను వ్యవసాయ కుటుంబం లో పుట్టిన వాడినేనని పేర్కొన్నారు.

నీళ్లు లేక పంటలు వెసుకోలేని రోజుల నుoడి బీడుభూములు లేకుండా కెసిఆర్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రం గుడ్డి దీపంలాగా ఉండేదని.. 24 గంటల కరెంటు తెలంగాణ లో తప్ప దేశం లో ఎక్కడ లేదని స్పష్టం చేశారు. రైతులకు భద్రత కల్పించిన రాష్ట్రం తెలంగాణ అని.. ఎన్నికలు కోరుకున్నది ఈటల రాజేందర్ అని మండిపడ్డారు. నల్లచెట్టలను వ్యతిరేకించిన ఈటల ఈరోజు అదే బీజేపీ లో చేరాడని.. ఆత్మగౌరం ఈటల కె కాదు ప్రజలందరికీ ఉన్నదన్నారు. వ్యక్తి గత ఆస్తులు పెంచుకోవడం తప్ప అభివృద్ది మీద దృషి పెట్టలేదని.. టీ ఆర్ ఎస్ గెలిస్తే.. ప్రజలు గెలిచినట్టే అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news