భీమ్లా నాయక్ అదిరిపోయే అప్డేట్ : ఇక పవన్ ఫ్యాన్స్ పూనకాలే

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరియు హీరో దగ్గుబాటి రానాతో కలిసి మల్టీస్టారర్‌ సినిమా చేస్తున్నాడు. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలోనే.. ఈ సినిమా మేకింగ్ వీడియో ను చిత్ర బృందం రీలిజ్ చేసింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. భీమ్లా నాయక్ నుంచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అంటే ఆగస్టు 15న ఈ సినిమా నుంచి…. ఫస్ట్ గ్లిమ్స్ మరియు ఈ సినిమా టైటిల్ ను కూడా అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుంగీ కట్టుకుని జఓ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. జై తాజా అప్డేట్ తో పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news