కేసీఆర్ ని కాపాడుకోవాలి లేదంటే మళ్ళీ సమైక్య రాష్ట్రమే.. గంగుల సంచలనం !

-

షర్మిల కొత్త పార్టీకి సమబందించి మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగనన్న బాణం షర్మిల వస్తోందని, ఆ తర్వాత మెల్లగా జగన్ వస్తాడు అని జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని అన్నారు. అదే జరిగితే తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవన్న ఆయన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

కేసీఆరే మన రక్షకుడన్న ఆయన ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవని మళ్ళీ సమైక్య రాష్ట్రము వచ్చినా ఆశ్చర్యం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక మరో పక్క తెలంగాణలో కొత్త పార్టీ ప్రకటించడానికి గాను షర్మిల పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. ఆమె మే నెలలో లేదా ఏప్రిల్ నెలలో కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఇది ఎంతవరకూ సఫలం అవుతుందో ? 

Read more RELATED
Recommended to you

Latest news