అదిరే కేంద్ర ప్రభుత్వ స్కీమ్.. రూ.70 లక్షల వరకు పొందొచ్చు..!

-

National savings certificate: కేంద్రం ఎన్నో రకాల టూర్ ప్యాకేజీలని తీసుకు వస్తూనే వుంది. కేంద్రం తీసుకు వచ్చిన ఈ పథకాల్లో డబ్బులు పెడితే అదిరే లాభాలని పొందేందుకు అవుతుంది. చిన్న పొదుపు పథకాలు సురక్షితమైన పెట్టుబడి ఎంపిక. అందుకే అంతా వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇందులో మంచి మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో మంచి మొత్తం సంపాదించవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, NSC, సుకన్య సమృద్ధి యోజన ఇలా చాలా చిన్న పొదుపు పథకాలు వున్నాయి.

ఎన్‌ఎస్‌సీ లో పెట్టుబడి పెట్టడం ద్వారా సూపర్ బెనిఫిట్స్ ని పొందవచ్చు. ఇక మరి ఈ స్కీమ్ కి సంబంధించి పూర్తి వివరాలని చూసేద్దాం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లో ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయగలిగితే ఈ మెచ్యూరిటీపై 7.7% వార్షిక వడ్డీని పొందవచ్చు. ఈ స్కీమ్ లో ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. పెట్టుబడి పరిమితి లేదు. కావలసినంత మొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు డబ్బులు పెట్టచ్చు. ఇక ఈ స్కీమ్ లో ఐదేళ్లలో ఎంత మొత్తం వస్తుందో చూసేద్దాం…ఈ స్కీము లో డబ్బులు పెడితే పన్ను ఆదా అవుతుంది.

ఏటా రూ.1.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. 80సి కింద ఈ మినహాయింపు ఇవ్వబడింది. ఈ స్కీమ్ లో మీరు రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే… రూ. 44,903 వడ్డీ, ఐదేళ్లలో మొత్తం రూ. 1.44 లక్షల కార్పస్ వస్తుంది. రూ.5 లక్షల పెట్టుబడిపై ఐదేళ్లలో రూ.2.24 లక్షల వడ్డీ… మొత్తం రూ.7.24 లక్షలు. అదే దీనిలో మీరు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే ఐదేళ్లలో మీకు రూ.4.49 లక్షల వడ్డీ.. మొత్తం కార్పస్‌లో రూ.14.49 లక్షలు. రూ. 20 లక్షలు కి వడ్డీ రూ. 8.98 లక్షలు, మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ. 28.98 లక్షలు. రూ.30 లక్షల కి రూ.13.47 లక్షల వడ్డీ మెచ్యూరిటీ తర్వాత మొత్తం రూ.43.47 లక్షలు ని పొందవచ్చు. రూ.40 లక్షలు కి అయితే వడ్డీ రూ.17.96 లక్షలు, కార్పస్ రూ.57.96 లక్షలు. రూ. 50 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీలో రూ. 72.45 లక్షలు. వడ్డీ రూ. 22.45 లక్షలు.

Read more RELATED
Recommended to you

Latest news