BREAKING : ఏపీలో మరో విషాదం..యువతిపై చాకుతో ప్రేమోన్మాది దాడి

-

ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. పగో.. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. నిన్న అర్ధరాత్రి మాణిక్యం అనే యువతిపై రాజులపాటి కల్యాణ్ అనే యువకుడు చాకుతో దాడి చేశాడు. అడ్డువచ్చిన మాణిక్యం చెల్లెలు వెంకట లక్ష్మి ని, తల్లి భాగ్యలక్ష్మిపైనా చాకుతో దాడి చేశాడు ఆ దుర్మార్గుడు. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ముగ్గురిని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారని తెలుస్తోంది. గత రెండు నెలలుగా ప్రేమిస్తున్నానంటూ మాణిక్యం వెంట పడుతున్న కళ్యాణ్ ను.. పలుమార్లు హెచ్చరించారు మాణిక్యం తండ్రి ఏడుకొండలు. గతంలో రెండు సార్లు ఏడుకొండలు పశువుల మేతకు నిప్పు పెట్టాడు కళ్యాణ్. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news