వచ్చే జనవరి నాటికి అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తి : అమిత్ షా

-

వచ్చే ఏడాది జనవరి 1 నాటికి అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వెల్లడించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న త్రిపురలోని ఓ రథయాత్రలో అమిత్‌షా పాల్గొన్నారు.”రాహుల్‌ బాబా! సబ్రూమ్‌ నుంచి చెబుతున్నా విను.. అయోధ్య రామమందిరం జనవరి 01, 2024 నాటికి పూర్తవుతుంది” అని అమిత్​ షా అన్నారు.

కాంగ్రెస్​, కమ్యూనిస్టు పార్టీలే రామ మందిర సమస్యను ఏళ్ల తరబడి కోర్టులో మగ్గిపోయేలా చేశాయని షా ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు​ వచ్చిన వెంటనే నరేంద్ర మోదీ రామ మందిరానికి భూమి పూజ చేశారన్నారు. రామమందిరం అంశాన్ని 1990లో తమ అగ్ర నేత ఎల్​కే అడ్వాణీ రథయాత్ర చేపట్టిన నుంచి లేవనెత్తుతోంది బీజేపీ. ఇప్పుడు కూడా మరోసారి ఆ అంశాన్ని తెరపైకి చెచ్చి 2024లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో అస్త్రంగా ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news