దారుణం.. 35సార్లు కసితీరా కత్తితో పడిచి ప్రేయసి హత్య

-

రోజురోజుకు సమాజంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. అనైతిక సంబంధాల వల్ల జరుగుతున్న హత్యలు కూడా పెరిగిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఠాణెలో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు ఓ వ్యక్తి తన ప్రియురాలిని 35 సార్లు కత్తితో పొడిచి పాశవికంగా హత్య చేశాడు. గత నెలలో జరిగిన ఈ దారుణం పోలీసుల దర్యాప్తుతో తాజాగా వెలుగులోకి వచ్చింది.

పుణెకు చెందిన రూపాంజలి అనే వివాహితకు జయరామ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా జయరామ్‌ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. పెళ్లి కోసం జయరామ్‌ను బలవంతపెట్టింది. దీంతో రూపాంజలిని పథకం ప్రకారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, స్నేహితుడు సూరజ్‌తో కలిసి కత్తితో 35 సార్లు ఆమెను పొడిచి హత్య చేశాడు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news