20 లక్షల పరిహారం ఇవ్వండి.. సీఎం కి లేఖ రాసిన ఉత్తమ్..?

-

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవలే భారీగా కురిసిన వర్షాలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన విషయం తెలిసిందే. దాదాపు ఎన్నో రోజుల పాటు హైదరాబాద్ నగరం మొత్తం వరదల్లో మునిగి తేలింది. ఈ క్రమంలోనే వరద బాధితులు అందరినీ ఆదుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ నగరంలో వచ్చిన వరదల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఈ క్రమంలోనే టిపిసిసి ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త డిమాండ్ తెరమీదికి తెస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల కారణంగా చనిపోయిన వరద బాధితుల కుటుంబాలకు ఏకంగా 20 లక్షల పరిహారం అందించాలి అంటూ కోరారు. అంతేకాకుండా వరదల కారణంగా నష్టపోయిన వారికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు పరిహారం అందించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news