వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. వెండి ధ‌ర‌లూ..

-

రోజురోజుకు బంగారం ధ‌ర పైపైకి క‌దులుతూనే ఉంది. ఈ రోజు కూడా బంగారం ధ‌ర భారీ పెరుగుద‌ల న‌మోదు చేసింది. ఆదివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు పెరిగింది. దీంతో 40,690 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 37,300 రూపాయలకు చేరింది. కాగా, వెండి ధర కూడా వరుసగా రెండో రోజూ భారీ పెరుగుదల నమోదు చేసింది. వెండి కేజీకి 250 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 49,350 రూపాయల వద్దకు ఎగబాకింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు పై పైకి కదిలాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగింది. దీంతో 39,300 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200 రూపాయల పెరుగుదల నమోదు చేసి 38,100 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 250 రూపాయలు పెరిగింది. దీంతో వెండి కేజీకి 49,350 రూపాయల వద్దకు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news