మగువలకు బిగ్ షాక్.. 53 వేలు దాటిన బంగారం ధరలు

-

భూమిపైన వాటిల్లో బంగారం అత్యంత విలువైన వస్తువు. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతారు.


కరోనా ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధరలు విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగి పోయాయి.

హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1090 పెరిగి రూ. 53,890 కు చేరింది. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1000 పెరిగి రూ. 49,400 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం కాస్త పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 2300 పెరిగి రూ. 75,700 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version