ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. నేడు సీతారాములోరి కళ్యాణం కన్నుల పండువగా జరగనుంది. ఈ క్రమంలోనే సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు బహుమతిగా వచ్చాయి.
ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు రూ.6.60 కోట్ల వజ్రాల స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత పి.ప్రతాప్ రెడ్డి విరాళంగా ఇచ్చారు. 7 కేజీల బంగారంతో తయారైన మూడు కిరీటాలను టీటీడీ చైర్మన్, ఈవోలకు అందించి, పూజల తర్వాత అలంకరించారు. ఈ స్వర్ణ కిరీటాలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులకు స్వర్ణ కిరీటాలు
ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణులకు రూ.6.60 కోట్ల వజ్రాల స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత పి.ప్రతాప్ రెడ్డి విరాళంగా ఇచ్చారు. 7 కేజీల బంగారంతో తయారైన మూడు కిరీటాలను టీటీడీ చైర్మన్, ఈవోలకు అందించి, పూజల తర్వాత అలంకరించారు. pic.twitter.com/iiuIuVR953
— ChotaNews App (@ChotaNewsApp) April 11, 2025