తెలంగాణలో త్వరలోనే మరో మూడు ఉప ఎన్నికలు : గోనె ప్రకాష్ సంచలనం

-

మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత రాజకీయ విశ్లేషకులు గోనె ప్రకాష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు ఉప ఎన్నికలు రానున్నాయని… దాని కోసం అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని బాంబు పేల్చారు గోనె ప్రకాశ్. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు… పౌరసత్వం త్వరలోనే రద్దు కాబోతుందని పేర్కొన్నారు.

ఆయన పార్టీ సభ్యత్వం రద్దు కాగానే డిసెంబర్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు గోనె ప్రకాష్. కాంగ్రెస్ పార్టీలోని.. సీనియర్ నాయకులు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత కొంత కాలంగా.. రేవంత్ రెడ్డి పై రాజగోపాల్ అసంతృప్తిగా ఉన్నారని.. ఈ నేపథ్యంలోనే… ఎమ్మెల్యే పదవికి మరియు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేస్తారని జోస్యం చెప్పారు. ఇది జనవరి మాసంలో గా జరుగుతుందని కూడా పేర్కొన్నారు గోనె ప్రకాష్. ఈ రెండు ఉప ఎన్నికల అనంతరం.. మూడు ఉప ఎన్నిక పై క్లారిటీ ఇస్తానని చెప్పారు గోనె ప్రకాష్. అయితే.. వేములవాడ మరియు మునుగోడు నియోజకవర్గాల్లో ఎగిరేది కాషాయ జెండా నేనని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news