సివిల్స్‌ పరీక్ష రాసే అభ్యర్థులకు గుడ్‌న్యూస్…..దరఖాస్తు గడువు పెంపు

-

సివిల్స్‌ పరీక్ష రాసే అభ్యర్థులకు గుడ్‌న్యూస్ .  సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 పరీక్షకు దరఖాస్తుల గడువును యూపీఎస్సీ పొడిగించింది. ఇదివరకు ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం ఇవల్టితో (మంగళవారం)తో గడువు ముగిస్తుండగా, అభ్యర్థుల విన్నపంతో బుధవారం వరకు పొడిగించింది.

1,056 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 14న యూపీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. దీంతోపాటు ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో 150 ఖాళీల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష దరఖాస్తుల గడువును కూడా పొడిగించింది. ఈ 2 పరీక్షలకు ఇంకా దరఖాస్తు చేసుకోనివారు మార్చి 6న సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న జరగనుంది. ఈ పరీక్షకి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

తాజా నిర్ణయంతో ఆయా కారణాల చేత అప్లై చేయకుండా మిగిలిపోయిన అభ్యర్థులు బుధవారం సాయంత్రంలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news