రైతులకు శుభవార్త.. వారంలోపు మిగిలిన వారందరికీ రుణమాఫీ : మంత్రి కోమటి రెడ్డి

-

రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వారం లోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తి అవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లాలోని నల్గొండ మండలం అర్థాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.  ధాన్యం కొనుగోలు తరువాత 3 రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. సన్నాలను ప్రోత్సహించడానికే రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పక్క రాష్ట్రం నుంచి జిల్లాలోకి ధాన్యం రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఉచిత విద్యుత్ కి మొదట సోనియా గాంధీ ఒప్పుకోలేదని.. వైఎస్సార్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు చేసి.. ఆ తర్వాత ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మారేందుకు దోహదపడ్డారని మంత్రి కోమటి రెడ్డి గుర్తు చేశారు. తన ఉసురు, ప్రజల ఉసురు తగిలి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతుల ప్రభుత్వం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news