హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. మైండ్‌స్పేస్ వరకు మెట్రో

-

హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశలో మరో ముందడుగు వేసింది. ఇది ఐటీ ఉద్యోగులకు మరింత ఊరటనిచ్చింది. ప్రస్తుతం హైటెక్ సిటీ వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండగా, ఈ నెల 29 నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా మెట్రో కారిడార్-3లో నాగోల్ నుంచి మైండ్ స్పేస్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల దూరం మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది.

ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి మెట్రో సేవలు ప్రారంభమైతే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ఊరట లభిస్తుంది. ప్రస్తుతం హైటెక్ సిటీ, రాయదుర్గం చెరువు మెట్రో స్టేషన్ల నుంచి ఐటీ ఉద్యోగులు షటిల్ సర్వీసుల ద్వారా కంపెనీలకు చేరుకుంటున్నారు. ఇప్పుడు మైండ్‌స్పేస్ జంక్షన్ స్టేషన్ అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. ఈ నెల 29న మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్‌కుమార్‌లు మైండ్‌స్పేస్ స్టేషన్ వరకు రైలును ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news