RRRకు గుడ్ న్యూస్.. టికెట్ల ధ‌ర‌లు పెంచేందుకు ఏపీ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు భార‌త దేశంలోనే దిగ్గ‌జ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇండియాలో గ్రెట్ డైరెక్ట‌ర్, తెలుగు తో పాటు ఇత‌ర భాషాల‌లో మంచి గుర్తింపు ఉన్న హీరోల కాంబినేషన్ లో వ‌స్తున్న ఈ సినిమా.. ఎన్నో అంచ‌నాల‌తో ఈ నెల 25వ తేదీన విడుద‌ల కాబోతుంది.

కాగ ఈ సినిమా విడుద‌లకు ముందు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్ఆర్ఆర్ సినిమా టిక్కెట్ ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. దీంతో ఈ సినిమా టిక్కెట్ ధ‌ర రూ. 100 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది.

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఆర్ఆర్ఆర్ సినిమా క‌లెక్షన్లు మ‌రింత పెర‌గ‌డానికి అవ‌కాశం ఉంది. అంతే కాకుండా.. ఆర్ఆర్ఆర్ సినిమాకు బెనిఫిట్ షోలను ప్ర‌ద‌ర్శించ‌డానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సంతోషం వ్య‌క్తం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news